ఈ సేవా సంస్థ సర్వ ధర్మములకు మూలము వేదములు, అట్టి వేదములు చెప్పబడిన మార్గమును, వైదిక మార్గము అందురు. అట్టి ధర్మపరిరక్షణ చేయుట వలన దైవానుగ్రహము, కూడా కలుగును. మరియు ధర్మపరిరక్షణ వలన లోకమున శాంతి సౌఖ్యము సౌభాగ్యము కూడా కలుగును. ఇప్పటి కాలమాన పరిస్థితులలో ప్రతివారు ఇంటి వద్ద చేయవలసిన నవగ్రహములు మొదలైన, దేవతా, పూజ, హోమ, అభిషేకాదులు చేసుకొనుటకు సరియైన బ్రాహ్మణులు తగ్గుట ఆర్ధిక బాహుళ్యము పరివారము లేకపోవుట వల్లనూ స్వయముగా ఆచరించుట ఆవకాశం లేని కారణముగా అవి ఆచరించలేక అనేక ఇబ్బందులకు గురి అగుచున్నారు. ఈ సమస్యల పరిష్కారముగా ఆస్తికుల సహకారముతో ఒక సంస్థను స్థాపించి వీలుపడినంత వైదిక ధర్మ పరిరక్షణ చేయు నిమిత్తం ఈ సంస్థ స్థాపించడం జరిగినది.